గాంధీభవన్ కు మళ్లీ వచ్చిన ఢిల్లీ పోలీసులు.. మరో నలుగురికి నోటీసులు

గాంధీభవన్ కు మళ్లీ వచ్చిన ఢిల్లీ పోలీసులు.. మరో నలుగురికి నోటీసులు

అమిత్ షా మార్ఫింగ్ వీడియోకు సంబంధించి కేసులో.. కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ గాంధీభవన్ కు మళ్లీ వచ్చారు ఢిల్లీ పోలీసులు. మరో నలుగురికి నోటీసులు ఇవ్వాలంటూ సమాచారం ఇచ్చారు. అయితే ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ లీగల్ సెల్ నాయకులు అందుబాటులో లేరని చెప్పటంతో.. మళ్లీ వస్తామని చెప్పి వెళ్లిపోయారు ఢిల్లీ పోలీసులు. ఇప్పటికే ఒకసారి నోటీసులు ఇచ్చిన ఢిల్లీ పోలీసులు.. మరో నలుగురికి నోటీసులు ఇవ్వటానికి మళ్లీ రావటం చర్చనీయాంశం అయ్యింది. 

హైదరాబాద్ లోనే ఉన్న ఢిల్లీ పోలీసులు.. కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వారియర్స్ ఇళ్ల చుట్టూ తిరుగుతున్నారు. నోటీసుల్లో ఉన్న వ్యక్తులు దొరికితే విచారణ చేయటానికి ప్రయత్నిస్తున్నారు. అయితే ఇదే కేసులో ఇప్పటికే హైదరాబాద్ లో నమోదైన కేసులో.. హైదరాబాద్ పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరో నలుగురికి నోటీసులు ఇవ్వాలంటూ ఢిల్లీ పోలీసులు.. 2024, మే 2వ తేదీన గాంధీభవన్ కు రావటం విశేషం. 

©️ VIL Media Pvt Ltd.

2024-05-02T07:45:20Z dg43tfdfdgfd