రైతులకు ఉచితంగా రూ.50,000. కేంద్రం పథకం. ఇలా దరఖాస్తు చేసుకోండి
పథకం పేరు:ఈ పథకం పేరు పరంపరాగత్ కృషి వికాస్ పథకం (Paramparagat Krishi Vikas Yojana - PKVY). దేశంలోని రైతులు సేంద్రియ వ్యవసాయం (organic farming) చేయడానికి భారత ప్రభుత్వం వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ ద్వారా పరంపరాగత్ కృషి వికాస్ యోజనను 2015లో ప్రారంభించింది. ఈ పథకం ద్వారా రైతులకు సేంద్రియ వ్యవసాయం చేసేందుకు కేంద్రం ఆర్థిక సాయం చేస్తుంది. ఈ పథకం ద్వారా సేంద్రియ వ్యవసాయంలో భూసారాన్ని పెంచుకోవచ్చు. ఈ పథకంలో పురుగు మందులు, రసాయనాల వాడకాన్ని బాగా తగ్గిస్తారు. రైతులకు ఉచితంగా మనీ:ఈ పథకంలో భాగంగా రైతులకు 3 సంవత్సరాల పాటు, హెక్టారుకు రూ.50,000 చొప్పున ఆర్థిక సాయం లభిస్తుంది. ఈ డబ్బులో పురుగుమందులు, విత్తనాలు, సేంద్రీయ ఎరువులు తదితర సేంద్రియ పదార్థాలను కొనేందుకు రూ.31,000 ఇస్తారు. దీంతోపాటు విలువ జోడింపు, మార్కెటింగ్ కోసం రూ.8,800. క్లస్టర్ నిర్మాణం, సామర్థ్యం పెంపు కోసం రూ.3వేలు ఇస్తారు. ఈ డబ్బును కేంద్రం.. DBT విధానంలో డైరెక్టుగా రైతు బ్యాంక్ అకౌంట్లో జమచేస్తుంది. అందువల్ల అవినీతి, లంచాలు, మధ్యవర్తుల సమస్య ఉండదు. దేశవ్యాప్తంగా లబ్ది పొందిన రైతులు:PKVY పథకం కింద కేంద్రం గత నాలుగేళ్లలో దేశవ్యాప్తంగా రూ.1,197 కోట్లు ఖర్చు చేసింది. తద్వారా సేంద్రియ వ్యవసాయం పెరిగింది. పురుగు మందుల వాడకం తగ్గుతోంది. భూసారం పెరుగుతోంది. పంట దిగుబడులు పెరుగుతున్నాయి. ప్రజలకు మంచి ఆహారం లభిస్తోంది. రైతులు కూడా కేంద్రం ఇచ్చే డబ్బుతో సేంద్రియ వ్యవసాయం చేస్తున్నారు. పథకం పొందేందుకు అర్హతలు:ఈ పథకం ద్వారా లబ్ది పొందాలంటే.. దరఖాస్తుదారుడు తప్పనిసరిగా భారత పౌరుడై ఉండాలి. రైతు వయస్సు 18 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండాలి. రైతు కేటగిరీ పౌరులు మాత్రమే ఈ పథకం కింద దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. దరఖాస్తు చేసుకునే రైతుకు సాగు భూమి ఉండాలి. పథకం కోసం ఉండాల్సిన పత్రాలు:మీరు పరంపరగత్ కృషి వికాస్ యోజన కింద దరఖాస్తు చేయాలనుకుంటే, మీరు కొన్ని పత్రాలను కలిగి ఉండాలి. అవి ఆధార్ కార్డు, చిరునామా రుజువు, ఆదాయ ధృవీకరణ పత్రం, గుర్తింపు కార్డు, రేషన్ కార్డు, మొబైల్ నంబర్, ఇమెయిల్ ఐడి, బ్యాంకు పాస్ బుక్, పాస్పోర్ట్ సైజు ఫొటో కలిగివుండాలి. మనీ కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి?ముందుగా మీరు పరంపరగత్ కృషి వికాస్ యోజన అధికారిక వెబ్సైట్ (https://pgsindia-ncof.gov.in/PKVY)కి వెళ్లాలి. వెబ్సైట్ హోమ్ పేజీలో, మీరు వర్తించు (Apply) ఆప్షన్పై క్లిక్ చేయాలి. వెంటనే దరఖాస్తు ఫారమ్ మీ ముందు ఓపెన్ అవుతుంది. దరఖాస్తు ఫారమ్లో అడిగిన సమాచారాన్ని జాగ్రత్తగా నమోదు చేయాలి. మీ పేరు, మొబైల్ నంబర్, చిరునామా సంబంధిత సమాచారం, రాష్ట్రం, ఇమెయిల్ ID మొదలైనవి అడుగుతారు. మొత్తం సమాచారాన్ని నమోదు చేశాక, మీరు దరఖాస్తు ఫారమ్లో అడిగిన పత్రాలను అప్లోడ్ చేయాలి. తర్వాత మీరు సబ్మిట్ (submit) ఆప్షన్పై క్లిక్ చేయాలి. వెంటనే, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్లో మీకు రిజిస్ట్రేషన్ నంబర్ వస్తుంది. దీన్ని మీరు మీతో సురక్షితంగా ఉంచుకోవాలి. మీరు మనీ పొందేందుకు ఈ నంబర్ మీకు ఉపయోగపడుతుంది. PKVY పోర్టల్కి ఎలా లాగిన్ అవ్వాలి?పరంపరాగత్ కృషి వికాస్ యోజనకు లాగిన్ చేయడానికి, ముందుగా మీరు అధికారిక వెబ్సైట్కి వెళ్లాలి. తర్వాత హోమ్ పేజీలో మీరు లాగిన్ ఆప్షన్ క్లిక్ చేయాలి. లాగిన్ కోసం మీ ముందు కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. మీరు వినియోగదారు (యూజర్) పేరు, పాస్వర్డ్ను నమోదు చేయాలి. చివరగా క్యాప్చా కోడ్ ఇచ్చి, లాగిన్ ఎంపికపై క్లిక్ చేయాలి. ఇలా మీరు PKVY పోర్టల్కి లాగిన్ అవ్వగలరు.
2024-05-19T08:28:32Z
Weather Report: ఏపీ, తెలంగాణకు మరో 7 రోజులు వర్ష సూచన
భారత వాతావరణ విభాగం (IMD) తాజా బులిటెన్ ప్రకారం.. రాయలసీమ, కోస్తాంధ్ర, యానాం, తెలంగాణలో ఇవాళ్టి (19 మే) నుంచి 7 రోజులపాటూ వానలు పడతాయి. ఇవి తేలికపాటి నుంచి మోస్తరు ఉంటాయి. వీటికి తోడు పిడుగులు కూడా పడతాయి. గాలి వేగం గంటకు 30 నుంచి 40 కిలోమీటర్లుగా ఉంటుంది. మరో విషయం నైరుతీ రుతుపవనాలు.. మరో 36 గంటల్లో.. అండమాన్ నికోబార్ దీవులు, ఆగ్నేయ బంగాళాఖాతాన్ని చేరతాయని తెలిపింది. వివరంగా తెలుసుకునేందుకు మనం శాటిలైట్ ప్రెసిపిటేషన్ చూస్తే.. ఈ రోజంతా తెలుగు రాష్ట్రాల్లో అంతటా మేఘాలు ఉంటాయి. ఉదయం వేళ హైదరాబాద్ పరిసరాలు, కోస్తాంధ్ర, మధ్య రాయలసీమలో జల్లులు పడతాయి. మధ్యాహ్నం 1 గంట తర్వాత ఏపీ తీరం వెంట వాన పడుతుంది. అలాగే హైదరాబాద్లోనూ జల్లులు పడతాయి. సమయం గడిచేకొద్దీ ఉత్తరాంధ్రలో వాన పెరుగుతుంది. సాయంత్రం 3 తర్వాత అక్కడ మోస్తరు వాన పడుతుంది. అప్పుడు హైదరాబాద్లో జల్లులు పడతాయి. అప్పుడు తిరుపతిలో మోస్తరు వాన పడుతుంది. సాయంత్రం 5 దాటాక తెలుగు రాష్ట్రాల్లో తీరం వెంట తప్ప మిగతా చాలా చోట్ల వాన పడుతుంది. దక్షిణ రాయలసీమలో మోస్తరు వర్షం పడుతుంది. రాత్రి 7 తర్వాత పశ్చిమ రాయలసీమలో మోస్తరు వాన పడుతుంది. అప్పుడు హైదరాబాద్లో జల్లులు పడతాయి. రాత్రి 9 తర్వాత పశ్చిమ రాయలసీమలో వాన పడుతూనే ఉంటుంది. రాత్రి 12 తర్వాత ఏపీ, తెలంగాణలో మేఘాలు ఉంటాయి. వాన ఉండదు. గాలి వేగం బంగాళాఖాతంలో 14 నుంచి 24 కిలోమీటర్లుగా ఉంటుంది. ఏపీలో 9 నుంచి 13 కిలోమీటర్లుగా ఉంటుంది. తెలంగాణలో 6 నుంచి 11 కిలోమీటర్లుగా ఉంటుంది. ఐతే.. సాయంత్రం వేళ గాలి వేగం పెరుగుతోంది. గాలి రకరకాల దిశల్లో వెళ్తోంది. అందువల్ల వాతావరణం ఎప్పుడు ఎలా మారుతుందో చెప్పలేని విధంగా ఉంటుంది. ఉష్ణోగ్రత ఇవాళ మరింత తగ్గుతుంది. ఏపీలో పగటివేళ మాగ్జిమం 29 నుంచి 35 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. గుంటూరులో 33, విశాఖలో 32, కడపలో 36, అనంతపురంలో 32 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. తెలంగాణ చూస్తే.. పగటివేళ మాగ్జిమం 32 నుంచి 35 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. హైదరాబాద్లో 31, రామగుండంలో 35, ఖమ్మంలో 34, గద్వాలలో 33 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. తేమ బాగా ఉంది. తెలంగాణలో యావరేజ్గా 61 శాతం ఉంది. ఏపీలో యావరేజ్గా 68 శాతం ఉంది. ఇది ఉదయం, సాయంత్రం మరింత పెరుగుతోంది. అందువల్ల మనకు ఉదయం, సాయంత్రం వానలు పడే అవకాశం ఎక్కువగా ఉంటోంది. ఐతే.. IMD చెప్పినట్లు భారీ, అతి భారీ వర్షాలు మాత్రం పడట్లేదు. ఈదురు గాలులు కూడా అంతగా లేవు. వాతావరణ అంచనాలు తప్పుతున్నాయి. (All Images credit - IMD)
2024-05-19T00:42:27Z