చిలుకూరుకు పోటెత్తిన భక్తులు.. భారీగా ట్రాఫిక్ జామ్

చిలుకూరుకు పోటెత్తిన భక్తులు.. భారీగా ట్రాఫిక్ జామ్

రంగారెడ్డి జిల్లా తెలంగాణ పోలీస్ అకాడమీ దగ్గర భారీగా ట్రాఫిక్ జాం అయింది. కిలోమీటర్ల వరకు వాహనాలు నిలిచిపోయాయి. ఉదయం 5 గంటల నుండి చిలుకూరు బాలాజీ దేవాలయానికి బారులు తీరారు భక్తులు. సంతానం లేనివారి కోసం ప్రత్యేక తీర్థ ప్రసాదాలు పంపిణీ చేస్తున్నారు పూజారీ. దీంతో హైదరాబాద్ తో పాటు చుట్టు పక్కల నుండి కార్లలో ఆలయానికి భారీగా చేరుకుంటున్నారు భక్తులు.

కాళీమందిర్ అప్పా జంక్షన్ నుంచి హిమాయత్ సాగర్ చౌరస్తా వరకు వాహనాలు నిలిచిపోయాయి. ఇప్పటికే 50 వేల మందికి పైగా భక్తులు చిలుకూరు టెంపుల్ కు చేరుకున్నారు. ఎక్కడికక్కడే వాహనాలు నిలిచిపోవడంతో  ట్రాఫిక్ ను కంట్రోల్ చేస్తున్నారు పోలీసులు. భారీగా వాహనాలు నిలిచిపోవడంతో విద్యార్థులు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 

©️ VIL Media Pvt Ltd.

2024-04-19T05:30:45Z dg43tfdfdgfd