జగన్ కు మళ్ళీ అధికారం ఇస్తే పాతాళానికే.. అంబటి రాయుడు

జగన్ కు మళ్ళీ అధికారం ఇస్తే పాతాళానికే.. అంబటి రాయుడు

ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు కీలక దశకు చేరుకున్నాయి. ఎన్నికలకు రెండు వారాల సమయం కూడా లేకపోవటంతో నేతలంతా ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడటంతో నేతల విమర్శలు, ప్రతి విమర్శలతో రాష్ట్రం హోరెత్తుతోంది. ఈ క్రమంలో వైసీపీని వీడి జనసేనకు మద్దతు పలికిన క్రికెటర్ అంబటి రాయుడు సీఎం జగన్ ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. అవనిగడ్డలో జనసేన తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న అంబటి రాయుడు ఈ మేరకు సంచలన వ్యాఖ్యలు చేశారు.

జగన్ కు మళ్ళీ ఓటేస్తే రాష్ట్రం పాతాళానికే అని అన్నారు. వైసీపీలో ఉంటే ప్రజాసేవ చేయలేమని, ఆ పార్టీలో బానిసత్వం తప్ప , ఏ ఉండదని తెలుసుకున్నానని అన్నారు. ఎంపీ అయినా, ఎమ్మెల్యే అయినా జగన్ కాళ్ళ కింద చెప్పులా ఉండాల్సిందే అని సంచలన వ్యాఖ్యలు చేశారు అంబటి రాయుడు. జగన్ క్రీడారంగాన్ని సైతం నిర్వీర్యం చేశాడని మండిపడ్డారు. ఈ ఎన్నికల్లో సమర్థవంతుడైన నాయకుడ్ని ఎన్నుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు అంబటి రాయుడు. 

©️ VIL Media Pvt Ltd.

2024-05-02T12:01:03Z dg43tfdfdgfd