జగిత్యాలలో తన గురువును కలిసిన కేసీఆర్
జగిత్యాలలో తన గురువు, ప్రముఖ కవి జైషెట్టి రమణయ్యను ఇంటికెళ్లి కలిశారు బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్. వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి,ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ ఈ సందర్భంగా కేసీఆర్ కు ఆయన పలు పుస్తకాలు అందజేశారు. సిద్దిపేటలో కేసీఆర్ ఇంటర్ చదువుకునే రోజుల్లో జైషెట్టి రమణయ్య హిస్టరీ బోధించారు. అనంతరం కేసీఆర్ నిజామాబాద్ జిల్లా పర్యటనకు బయల్దేరారు. మరికాసేపట్లో నిజామాబాద్ జిల్లాలో ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్కు మద్దతుగా రోడ్ షో నిర్వహించనున్నారు.
©️ VIL Media Pvt Ltd. 2024-05-06T12:46:38Z dg43tfdfdgfd