జేపీ నడ్డాకు బిగ్ షాక్.. కర్ణాటక పోలీసులు సమన్లు

జేపీ నడ్డాకు బిగ్ షాక్.. కర్ణాటక పోలీసులు సమన్లు

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు బిగ్ షాక్ తగిలింది. కర్ణాటక పోలీసులు ఆయనకు సమన్లు పంపించారు. సోషల్ మీడియాలో వివాదస్పద పోస్టు పెట్టినట్లుగా పోలీసులు గుర్తించారు.  నడ్డాతో పాటుగా ఐటీ సెల్ హెడ్ అమిత్ మాల్వియాలకు కూడా పోలీసులు సమన్లు పంపిచారు.  బెంగళూరులోని హైగ్రౌండ్స్ పోలీస్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ బుధవారం నేతలకు నోటీసులు జారీ చేశారు. బెంగళూరు పోలీసుల ఎదుట హాజరయ్యేందుకు జేపీ నడ్డా, అమిత్ మాల్వియాలకు వారం రోజుల గడువు ఇచ్చారు. 

ఓబీసీ కోటాలో ముస్లిం రిజర్వేషన్ల అనే అంశంపై బీజేపీ ఓ యానిమేటేడ్ వీడియోను తన అధికారిక ఎక్స్ హ్యాండిల్‌లో పోస్ట్ చేసింది. ఇందులో రాహుల్ గాంధీ, సీఎం సిద్ధరామయ్య ఎస్సీ/ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లను ముస్లింలకు కేటాయిస్తున్నారని, వారికే ఎక్కువ నిధులు ఇస్తున్నారని చూపించారు. దీనిపై కాంగ్రెస్ తీవ్ర విమర్శలు చేస్తోంది. మతాల మధ్య చిచ్చుపెట్టాలా ప్రయత్నిస్తోందని మండిపడింది

©️ VIL Media Pvt Ltd.

2024-05-08T12:07:56Z dg43tfdfdgfd