జైలు నుంచి ప్రభుత్వాన్ని నడపలేరు : గవర్నర్ వీకే. సక్సేనా
‘‘ఢిల్లీ ప్రభుత్వాన్ని జైలు నుంచి నడపడం కుదరదు. అందుకు నేను హామీ ఇస్తున్నాను” అని ఆయన పేర్కొన్నారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసు కింద కేజ్రీవాల్ను మార్చి 21న ఈడీ అరెస్టు చేసింది. ఈ నెల 28 వరకూ ఆయనకు కోర్టు రిమాండ్ విధించింది. అయినప్పటికీ జైలు నుంచే ఆయన ఆదేశాలు ఇస్తూ పాలననను కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎల్జీ ఈ విధంగా వ్యాఖ్యానించారు.
©️ VIL Media Pvt Ltd. 2024-03-28T03:11:02Z dg43tfdfdgfd