జొన్నల కొనుగోళ్ల పరిమితి పెంపు

జొన్నల కొనుగోళ్ల పరిమితి పెంపు

హైదరాబాద్​, వెలుగు: జొన్నల కొనుగోళ్ల పరిమితిని రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. ఎకరానికి 8.85 క్వింటాళ్లు కొనుగోలు చేసేలా గతంలో పరిమితులు ఉండగా.. ఈసారి డిమాండ్​ పెరగడంతో ఆ పరిమితిని పెంచాలని రైతులు డిమాండ్​ చేశారు. దీంతో ఆదిలాబాద్, నిర్మల్​ జిల్లాల్లో జొన్నల కొనుగోళ్ల పరిమితిని ఎకరాకు 12 క్వింటాళ్లకు పెంచామని వ్యవసాయ శాఖ  వెల్లడించింది. కొనుగోలు ఏజెన్సీ మార్క్​ఫెడ్​ చర్యలు చేపట్టాలని ఆదేశించింది. రైతులెవరూ తక్కువ ధరకు పంటను అమ్ముకోవద్దని సూచించింది. పెరిగిన దిగుబడికి అనుగుణంగా పరిమితిని పెంచి రైతుల నుంచి క్వింటాల్​కు రూ.3,180 మద్దతు ధరతో ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని స్పష్టం చేసింది.

©️ VIL Media Pvt Ltd.

2024-05-05T03:11:21Z dg43tfdfdgfd