టీఎస్ ఈసెట్​కు 96% మంది అటెండ్

టీఎస్ ఈసెట్​కు 96% మంది అటెండ్

హైదరాబాద్, వెలుగు: బీటెక్, ఫార్మసీ తదితర కోర్సుల్లో లేటరల్ ఎంట్రీ విధానంలో సెకండియర్ అడ్మిషన్ల కోసం సోమవారం నిర్వ హించిన టీఎస్ ఈసెట్ ఎగ్జామ్ కు 96.12 శాతం మంది హాజర య్యారు. ఏపీ, తెలంగాణలో 99 పరీక్షా కేంద్రాల్లో జరిగిన ఈ పరీక్ష కు 24,272 మందికిగాను 23,330 మంది అటెండ్ అయ్యారని ఈసెట్ కన్వీనర్ చంద్రశేఖర్ తెలిపారు. 

తెలంగాణలో 95.58% మంది, ఏపీ లో 90.85% మంది పరీక్ష రాశార ని చెప్పారు. ఈ నెల 20వరకు ఫలితాలు రిలీజ్ చేస్తామన్నారు. కాగా, ఓయూలో ఉదయం క్వశ్చన్ పేపర్ పాస్ వర్డ్ ను హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ లింబాద్రి రిలీజ్ చేశారు. కౌన్సిల్ సెక్రటరీ శ్రీరామ్ వెంకటేశ్, ఓయూ వీసీ రవీందర్ తదితరులు పాల్గొన్నారు.

©️ VIL Media Pvt Ltd.

2024-05-07T01:48:20Z dg43tfdfdgfd