తెలంగాణలో వడదెబ్బతో ఇద్దరు మృతి

తెలంగాణలో వడదెబ్బతో ఇద్దరు మృతి

శంకరపట్నం, ఎర్రుపాలెం, వెలుగు: రాష్ట్రంలో వడదెబ్బతో ఇద్దరు మృతి చెందారు. కరీంనగర్‌‌‌‌‌‌‌‌ జిల్లా శంకరపట్నం మండలం తాడికల్ గ్రామానికి చెందిన చామంతుల మల్లయ్య(80) ఎండలు పెరగడంతో నాలుగు రోజులుగా ఇంట్లోనే ఉన్నాడు. ఈ క్రమంలోనే తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. సోమవారం వడదెబ్బతో మరణించాడు. ఎర్రుపాలెం మండల పరిధిలోని పెద్ద గోపవరం గ్రామానికి చెందిన రాసమేటి వెంకట కృష్ణ (39) ఆదివారం సాయంత్రం నుంచి కనిపించకుండా పోయాడు. 

రైల్వే స్టేషన్ సమీపంలోని ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ లో సోమవారం ఆయన మృతదేహం లభించింది. మృతదేహాన్ని ప్రభుత్వ సివిల్ హాస్పిటల్ కు తీసుకెళ్లి పంచనామా నిర్వహించి బంధువులకు అప్పగించారు. ఆదివారం సాయంత్రమే ఆయన మృతి చెంది ఉంటాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. రాసమేటి వెంక కృష్ణ పశువుల కాపరిగా జీవనాన్ని కొనసాగిస్తున్నాడని స్థానికులు తెలిపారు. 

©️ VIL Media Pvt Ltd.

2024-05-07T02:03:12Z dg43tfdfdgfd