థర్డ్ ఫేజ్ పోలింగ్ లో.. ఓటేసిన ప్రముఖులు
లోక్ సభ ఎన్నికల మూడో దశ పోలింగ్ కొనసాగుతోంది. 12 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 94 పార్లమెంటు నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతోంది. ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. గుజరాత్లోని అహ్మదాబాద్లోని పోలింగ్ బూత్లో ఓటు వేశారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. అమిత్ షా తో పాటు ఆయన భార్య, కొడుకు బీసీసీఐ సెక్రటరీ జై షా కూడా ఓటు వేశారు .
మహారాష్ట్రలోని లాతూర్ లో ఓటు హక్కు వినియోగించుకున్నారు సినీ నటి జెనీలియా. ప్రజాస్వామ్యంలో ఇవాళ అతి ముఖ్యమైన రోజు అని చెప్పారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కను వినియోగించుకోవాలని కోరారు. జెనీలియాతో పాటు తన భర్త దేశ్ ముఖ్ ఓటు వేశారు.
ఎన్సీపీ అధినేత శరద్ పవార్ బారామతిలోని పోలింగ్ బూత్ లో ఓటు వేశారు. .గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ గుజరాత్లోని అహ్మదాబాద్లోని పోలింగ్ బూత్లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. జామ్నగర్కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే రివాబా జడేజా పోలింగ్ స్టేషన్ నంబర్ 122, పండిట్ దీనదయాళ్ విద్యా భవన్లో ఓటు వేశారు.
©️ VIL Media Pvt Ltd. 2024-05-07T04:18:27Z dg43tfdfdgfd