దానంను కేసీఆర్ కోవర్టుగానే చూస్తం - కాంగ్రెస్ నేత రాజు యాదవ్
న్యూఢిల్లీ, వెలుగు : పార్టీ ఫిరాయింపు చేసిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ను కేసీఆర్ కోవర్టుగానే చూస్తామని కాంగ్రెస్ నేత, ఖైరతాబాద్ మాజీ కార్పొరేటర్ రాజు యాదవ్ అన్నారు. కాంగ్రెస్ ఎంపీగా ఆయన గెలిస్తే పార్టీ మారడని గ్యారంటీ లేదని, అందుకే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎంపీగా పోటీ చేయాలని డిమాండ్ చేశారు. బుధవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్ బయట మీడియాతో ఆయన మాట్లాడారు. దానం నాగేందర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా కాంగ్రెస్ నుంచి ఎంపీ టికెట్ ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. నాగేందర్పై అనర్హత వేటు వేయాలని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కమార్ను కోరామని చెప్పారు. స్పీకర్ ఎలాంటి చర్యలు తీసుకోనందునే తాను హైకోర్టులో దానంపై రిట్ పిటిషన్ దాఖలు చేసినట్లు వివరించారు. దానం బలమైన నేత అనుకొని అధిష్టానం టికెట్ ఇచ్చిందని, కానీ తన దృష్టిలో ఆయన బలమైన నేత కాదన్నారు.
©️ VIL Media Pvt Ltd. 2024-03-28T01:25:48Z dg43tfdfdgfd