నార్మల్ డెలివరీల సంఖ్య పెంచాలి : రమేశ్ చంద్ర
ఉప్పునుంతల, వెలుగు: నార్మల్ డెలివరీల సంఖ్య పెంచాలని జిల్లా ఆసుపత్రుల కోఆర్డినేటర్ డాక్టర్ రమేశ్చంద్ర సూచించారు. మండల కేంద్రంలోని ఆసుపత్రిని మంగళవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సమీక్ష నిర్వహించారు. జూన్ మొదటి వారంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయడానికి కావలసిన అన్ని పరికరాలు, వసతుల గురించి ఆరా తీశారు. ఆస్పత్రిలో పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో హెల్త్ ఆఫీసర్లు డాక్టర్ రమాకాంత్, డాక్టర్ శివ లీల, ఫార్మసిస్ట్ శ్రీనివాసులు పాల్గొన్నారు.
©️ VIL Media Pvt Ltd. 2024-05-08T05:07:18Z dg43tfdfdgfd