నిరుద్యోగులు, ఉద్యోగుల గొంతుకై పనిచేస్తా:తీన్మార్ మల్లన్న

నిరుద్యోగులు, ఉద్యోగుల గొంతుకై పనిచేస్తా:తీన్మార్ మల్లన్న

ఖమ్మం, నల్లగొండ, వరంగల్ జిల్లాల గ్రాడ్యూయేట్ ఎమ్మె్ల్సీ అభ్యర్థిగా కాంగ్రెస్ తరపు తీన్మార్ మల్లన్నను ఖరారు చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ..నిరుద్యోగులు, ఉద్యోగుల పక్షాన గొంతుకై వారికోసం పనిచేస్తానని చెప్పారు. గత ఎన్నికల్లో ఇండింపెండెట్ అభ్యర్థిగా పోటీ చేశారు.. చివరి వరకు గట్టిపోటీ ఇచ్చాను. ఈసారి తప్పకుండా గెలిపించాలని కోరారు. మండలిలో తన గొంతు వినిపించేందుకే సీఎం రేవంత్ రెడ్డి , కాంగ్రెస్ అధిష్టానం భావిం చి ఎమ్మెల్సీ అభ్యర్థిగా అవకాశమిచారని అన్నారు. 

భువనగిరి ఎంపీ గా పోటీ చేసేందుకు దరఖాస్తు చేసుకున్నా.. కరీంనగర్ స్థానం నుంచి కూడా కాంగ్రెస్ అధిష్టాం పరిశీలించింది. అయితే మండలిలోనే తాను ఉండాలని అధిష్టానం భావించి నాకు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా అవకాశం కల్పించారని తీన్మార్ మల్లన్న అన్నారు. ఎమ్మెల్సీగా పోటీ చేసే అవకాశం కల్పించి నందుకు సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీకి కృతజ్ణతలు తెలిపారు తీన్మార్ మల్లన్న. 

 

ALSO READ : తెలంగాణలో ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం: అమిత్ షా

©️ VIL Media Pvt Ltd.

2024-04-25T11:18:09Z dg43tfdfdgfd