పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాలు

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాలు

కడెం/నస్పూర్, వెలుగు: కడెం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 2007-–08లో పదో తరగతి చదివిన నాటి విద్యార్థులు మళ్లీ ఒకచోటికి చేరారు. మండలంలోని కొండుకూర్​లో ఉన్న ఓ ఫంక్షన్ హాల్​లో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. నాటి జ్ఞాపకాలను నెమరేసుకున్నారు. నాడు విద్య నేర్పిన గురువులను ఆహ్వానించి సన్మానించారు.

 శ్రీరాంపూర్ కాలనీలోని సాందిపనీ హైస్కూల్​లో 2004–05లో టెన్త్​ చదువుకున్న విద్యార్థులు ఆదివారం మంచిర్యాల పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్​లో కలుసుకున్నారు. చిన్ననాటి విషయాలను గుర్తుచేసుకుంటూ అనందంగా గాడిపారు. నాటి టీచర్లను సన్మానించారు.

©️ VIL Media Pvt Ltd.

2024-05-06T04:45:24Z dg43tfdfdgfd