పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి 13 మంది నామినేషన్​

పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి 13 మంది నామినేషన్​  

నల్గొండ అర్బన్, వెలుగు : వరంగల్,-- ఖమ్మం,-- నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి సోమవారం 13 మంది అభ్యర్థులు 16 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. ములుగు రెవెన్యూ అదనపు కలెక్టర్, నియోజకవర్గ అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి సీహెచ్ మహేందర్ కి అభ్యర్థులు నామినేషన్లను సమర్పించారు. తెలుగుదేశం నుంచి ముండ్ర మల్లికార్జునరావు 2  సెట్లు, ధర్మ సమాజ్ పార్టీ నుంచి బరిగల దుర్గాప్రసాద్ మహారాజ్ 1 సెట్ నామినేషన్, బీఆర్ఎస్  నుంచి ఆనుగుల రాకేశ్ 1 సెట్, నేషనల్ నవక్రాంతి పార్టీ అభ్యర్థి కర్ని రవి 1 సెట్ నామినేషన్ దాఖలు చేశారు. స్వతంత్ర అభ్యర్థులుగా పులిపాక సుజాత 2 సెట్ల నామినేషన్లు, చీదల్ల వెంకట సాంబశివరావు, చీదల్ల ఉమామహేశ్వరి, తాడిశెట్టి క్రాంతి కుమార్, అయితగోని రాఘవేంద్ర, భక్కా  జడ్సన్, బుగ్గ శ్రీకాంత్, పాలకూరి అశోక్ కుమార్, దేశ గాని సాంబశివరావు ఒక్కో సెట్​చొప్పున నామినేషన్లను దాఖలు చేశారు.

©️ VIL Media Pvt Ltd.

2024-05-07T03:48:23Z dg43tfdfdgfd