పదేండ్లు కార్మికులను గోసపెట్టిన బీఆర్ఎస్​ : గడ్డం వంశీకృష్ణ

పదేండ్లు కార్మికులను గోసపెట్టిన బీఆర్ఎస్​ : గడ్డం వంశీకృష్ణ

  • సింగరేణిని ప్రైవేటుపరం చేసే కుట్రలను తిప్పి కొట్టాలి : గడ్డం వంశీకృష్ణ
  • సింగరేణిలో కొత్త కోల్​మైన్స్​ తీసుకొస్తామని హామీ

కోల్​బెల్ట్, వెలుగు : పదేండ్ల బీఆర్ఎస్​ పాలనలో సింగరేణి కార్మికులను అరిగోస పెట్టిందని పెద్దపల్లి కాంగ్రెస్​ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ అన్నారు. గత బీఆర్ఎస్​ సర్కారు​ కార్మికుల సంపాదనను కూడా దోచుకున్నదని ఆరోపించారు. శుక్రవారం మంచిర్యాల జిల్లా మందమర్రి ఏరియా కాసీపేట–1 సింగరేణి బొగ్గు గనిపై కాంగ్రెస్​ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన గేట్ ​మీటింగ్​లో బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్, ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ లీడర్లతో కలిసి ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా గడ్డం వంశీ మాట్లాడుతూ.. కాకా వెంకటస్వామికి సింగరేణి కార్మికులంటే ఎనలేని ప్రేమ ఉండేదని చెప్పారు. సింగరేణి సంస్థను ప్రైవేటుపరం చేసే కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర సర్కారు​ నుంచి సింగరేణి సంస్థకు రావాల్సిన రూ.20 వేల కోట్ల విద్యుత్తు, బొగ్గు బకాయిలను ఇప్పించడానికి ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు. సింగరేణి కార్మికులకు ఇన్​కమ్​ ట్యాక్స్​ మినహాయింపు కోసం కృషి చేస్తానని చెప్పారు. 

రాజ్యాంగాన్ని రద్దు చేసేందుకు బీజేపీ యత్నం: ఎమ్మెల్యే వినోద్ 

బీఆర్​ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని రద్దు చేసేం దుకు బీజేపీ ప్రయత్నిస్తున్నదని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ ఆరోపించారు. పెద్దపల్లి ఎంపీగా గడ్డం వంశీకృష్ణను గెలిపించాలని పిలుపునిచ్చారు.  గేట్​ మీటింగ్​ అనంతరం వంశీకృష్ణ, వినోద్​ వెంకటస్వామి కాసీపేట మండలం ముత్యంపల్లి గ్రామంలో ఉపాధి హామీ కూలీలను కలిసి, వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పల్లెంగూడ గుట్ట ప్రాంతంలో ఉన్న కూలీల వద్దకు వంశీకృష్ణ స్వయంగా ట్రాక్టర్ నడుపుకుంటూ వెళ్లారు.

ఐఎన్టీయూసీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని కాసీపేట–1 మైన్​పై జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సింగరేణి గుర్తింపు సంఘం ఏఐటీయూసీ స్టేట్​ ప్రెసిడెంట్​ వాసిరెడ్డి సీతారామయ్య, సెక్రటరీ ఎండీ అక్బర్​ అలీ, బెల్లంపల్లి బ్రాంచి సెక్రటరీ దాగం మల్లేశ్, పిట్​సెక్రటరీ మీనుగు లక్ష్మీనారాయణ, ఐఎన్టీయూసీ లీడర్లు సమ్మయ్య, భూమయ్య, నరేందర్ తదితరులు పాల్గొన్నారు. ​  

  ©️ VIL Media Pvt Ltd.

2024-05-04T02:37:21Z dg43tfdfdgfd