ఏసీ ఆపినా కరెంటు బిల్లు పెరుగుతోందా? ఈ 1 సెకను పనితో బిల్లు సగానికి తగ్గుతుంది
ఏటా ఎండ వేడి పెరుగుతోంది. ఇప్పుడు ఇంట్లో ఏసీ తప్పనిసరి అయిపోతోంది. విపరీతమైన వేడిలో ఇల్లు చల్లగా ఉండాలంటే ఏసీ ఉండాల్సిందే. అయితే ఎయిర్ కండీషనర్ ఉన్నప్పుడు ఎంత హాయిగా అనిపిస్తుందో, కరెంటు బిల్లు విషయంలో ఆందోళన కూడా ఎక్కువే ఉంటుంది. ఏసీ రన్నింగ్ వల్ల కరెంటు బిల్లు బాగా పెరుగుతుంది. ఇది జేబుపై ఒత్తిడి తెస్తుంది. చాలా మంది డబ్బు ఆదా చేయడానికి, ఏసీని కాసేపు రన్ చేశాక, ఆఫ్ చేస్తారు. కాసేపటి తర్వాత మళ్లీ ఆన్ చేస్తారు. AC చల్లదనాన్ని ఇస్తూ, వేడి నుంచి ప్రజలకు ఉపశమనం కలిగిస్తుంది. విపరీతమైన వేడి నుంచి తప్పించుకోవడానికి ఏసీ ఆన్ చేస్తే, మధ్యతరగతి వారు కరెంటు బిల్లు పెరిగి ఇబ్బంది పడుతున్నారు. అయితే జేబుకి చిల్లు పడకుండా... ఏసీని ఆన్లో ఉంచుతూ కూడా.. బిల్లు పెరగకుండా చేసుకోవచ్చు. ఎలాగో తెలుసుకుందాం. రిమోట్ నుంచి ఏసీ ఆఫ్ చేసినా.. ఆ తర్వాత కూడా కొంత కరెంటును ఏసీ వాడుకుంటూనే ఉంటుంది. అందుకే మీరు ఏసీ వాడకపోయినా కరెంటు బిల్లు మాత్రం ఎక్కువగా వస్తూ ఉంటుంది. చాలా మంది తమ పడకగదిలో ఏసీని అమర్చుకుంటారు. రాత్రి నిద్రిస్తున్నప్పుడు లేదా అవసరమైనప్పుడు రిమోట్ ఉపయోగించి ఏసీని ఆఫ్ చేస్తారు. ఆ తర్వాత అసలు స్విచ్ ఆఫ్ చెయ్యరు. దీని వల్ల ఇండోర్ యూనిట్ పనిచేయడం ఆగుతుంది గానీ, అవుట్డోర్ యూనిట్ రన్ అవుతూ ఉంటుంది. అందువల్ల రిమోట్తో ఏసీని ఆపినప్పుడు.. ఏసీ మాత్రమే ఆగుతుందనీ, అవుట్డోర్ యూనిట్ పనిచేస్తూనే ఉంటుంది అనే విషయాన్ని మర్చిపోకూడదు. అవుట్డోర్ యూనిట్ బయట ఉంటుంది, కాబట్టి AC సరిగ్గా ఆఫ్ అవ్వలేదనే విషయం మీకు తెలియకపోవచ్చు. అది నడుస్తూనే ఉంటుంది. దీంతో విద్యుత్ వృథా అవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఏసీ తక్కువ వాడినా 24 గంటలూ వాడినట్లుగా కరెంటు బిల్లు ఎక్కువగా రావచ్చు. రిమోట్ ద్వారా ఏసీని స్విచ్ ఆఫ్ చేసిన తర్వాత, స్విచ్ బోర్డు మెయిన్ లైన్ నుంచి ఏసీని స్విచ్ ఆఫ్ చేయాలి. రిమోట్ మాత్రమే ఉపయోగించి, ఊరుకోవచ్చు. అసలు స్విచ్ కూడా ఆఫ్ చెయ్యండి. అప్పుడు కంప్లీట్గా కరెంటు సప్లై ఆగిపోయి.. ఏసీ కరెంటు బిల్లు తక్కువగా వస్తుంది.
2024-05-17T07:50:37Z