పోలీస్స్టేషన్లో దావత్.. కానిస్టేబుళ్ల సస్పెన్షన్
మల్లాపూర్ , వెలుగు : మల్లాపూర్ పోలీస్ స్టేషన్ లో బయట వ్యక్తులతో కలిసి దావత్ చేసుకున్న ఘటనలో ఇద్దరు కానిస్టేబుళ్లు సస్పెండ్ అయ్యారు. ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈనెల 17న ఇద్దరు కానిస్టేబుళ్లు ధనుంజయ్, సురేష్
ఒక హెడ్ కానిస్టేబుల్ అశోక్ తో పాటు మరో ఇద్దరు బయట వ్యక్తులు కలిసి పోలీస్ స్టేషన్లో దావత్ చేసుకున్నారు. ఈ ఘటనతో కానిస్టేబుల్ ళ్లను సస్పెండ్ చేస్తూ హెడ్ కానిస్టేబుల్ పై శావా పరమైన చర్యల కోసం మల్టీజోన్ -1 ఐజీకి రిపోర్టు పంపినట్లు ఎస్పీ తెలిపారు.
©️ VIL Media Pvt Ltd. 2024-03-29T03:43:22Z dg43tfdfdgfd