పోస్టల్ బ్యాలెట్ ఓటేసిన 5,233 మంది

పోస్టల్ బ్యాలెట్ ఓటేసిన 5,233 మంది

  • హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రాస్

హైదరాబాద్, వెలుగు:  హైదరాబాద్ జిల్లాలో ఇప్పటి వరకు 5,233మంది పోస్టల్ బ్యాలెట్ ఓటు హక్కును వినియోగించుకున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్ తెలిపారు. ఆదివారం 1,914  మంది పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకున్నట్టు చెప్పారు. హోమ్ ఓటింగ్ లో  531 మంది వినియోగించుకోగా..  కంటోన్మెంట్ లో 57కు 52 మంది సికింద్రాబాద్, హైదరాబాద్ లోక్ సభ స్థానాల్లో 514 కు 479 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. జిల్లాలో  మొత్తం 571 హోం ఓటర్లకు గాను  531 మంది వినియోగించుకున్నారని తెలిపారు.

©️ VIL Media Pvt Ltd.

2024-05-06T03:45:29Z dg43tfdfdgfd