ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం కాంగ్రెస్ : ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం కాంగ్రెస్ : ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం కాంగ్రెస్ అని చెప్పారు చెన్నూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి.  పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో బెల్లంపల్లి పట్టణంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇచ్చిన విధంగా ఇప్పుడు కూడా ఇందిరమ్మ ఇల్లు వచ్చేలా చూస్తామన్నారు.  రాహుల్ గాంధీ ప్రధానిగా కాగానే  రూ. 225గా ఉన్న రోజువారి రైతు కూలీని  రూ.400కు పెంచుతామని చెప్పారు.

కాంగ్రెస్ హయాంలో రూ. 460గా ఉన్న గ్యాస్ ధర, బీజేపీ హయాంలో రూ.1200కి పెరిగిందని చెప్పారు.  రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గ్యాస్ ధర 500 తగ్గించిందని చెప్పుకొచ్చారు.  మోదీ రూ. 60 రూపాయలు ఉన్న పెట్రోల్ ధరను రూ. 110 చేశారన్నారు. రూ. 50గా ఉన్న  రూ.150 రూపాయలు చేశారన్నారు. మోడీ, అమిత్ షా అంబానీ అదాని ఆస్తులు పెంచడానికి చూస్తున్నారని విమర్శించారు. మోడీ ఇప్పటివరకు ఇండస్ట్రియల్ వారికి రూ.14 లక్షల కోట్ల రుణమాఫీ చేశాడని ఆరోపించారు. రైతులకు మాత్రం రుణమాఫీ చేయడం లేదన్నారు. పెద్దపల్లి కాంగ్రెస్ అభ్యర్థి వంశీకృష్ణను ఎంపీగా గెలిపించాలని కోరారు. 

©️ VIL Media Pvt Ltd.

2024-05-05T05:26:44Z dg43tfdfdgfd