ప్రజలు దృష్టి డైవర్ట్ చేయడానికే కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్ కేసులు : జగదీష్ రెడ్డి

ప్రజలు దృష్టి డైవర్ట్ చేయడానికే కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్ కేసులు : జగదీష్ రెడ్డి

 మంచి స్క్రిప్ట్ రాసే డిటెక్టివ్ ను కాంగ్రెస్ పార్టీ వాడుకుంటోందని మాజీ మంత్రి జగదీశ్​రెడ్డి ఆరోపించారు. పార్లమెంట్ ఎన్నికల వరకు టైం పాస్ చేయాలనే ఉద్దేశంతోనే కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్ కేసులు తెరమీదకు తెచ్చారన్నారు. కాంగ్రెస్ హామీల నుంచి ప్రజల దృష్టి డైవర్ట్ కావాలని పనికి మాలిన కేసులు నమోదు చేశారని మండిపడ్డారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో జరిగిన మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. 

కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి ఒక పరాన్నజీవి. కోమటిరెడ్డి  బ్రదర్స్  పనికి మాలిన మాటలతో ఆరోపణలతో ప్రజలకు ఉపయోగపడేది ఏమి లేదు. రాష్టం నాలుగున్నర నెలల్లోనే ఆగమైంది. ఎట్లుండే తెలంగాణ ఎట్లయ్యింది అనే మాట మాట్లాడుకుంటున్నరు. కేసీఆర్ లేని లోటు  స్పష్టం కనిపిస్తోంది. కాంగ్రెస్ అధికారంపై ప్రజలకు నమ్మకంపోయింది. రైతుపక్షాన కేసీఆర్ ప్రశిస్తే.. ‘పేగులు కత్తిరిస్తా.. గుడ్లు పీకి గోలీలాడుతా.. లాగులో తొండలు ఇడుస్తా’ ఇదే నా భాష సీఎం మాట్లాడేది. 

పార్లమెంట్ ఎన్నికల వరకు కాంగ్రెస్ టైం పాస్ చేయాలనే ఉద్దేశంతోనే కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్ కేసులు తెరమీదకు తెచ్చారు. మంచి స్క్రిప్ట్ రాసే డిటెక్టివ్ ను కాంగ్రెస్ పార్టీ వాడుకుంటోంది’ అని జగదీశ్ రెడ్డి అన్నారు.

©️ VIL Media Pvt Ltd.

2024-05-09T13:06:09Z dg43tfdfdgfd