ప్రధానిగా మోదీ హ్యాట్రిక్ ఖాయం : కె. లక్ష్మణ్

ప్రధానిగా మోదీ హ్యాట్రిక్ ఖాయం : కె. లక్ష్మణ్

ముషీరాబాద్, వెలుగు: లోక్ సభ ఎన్నికల్లో గెలిచేది బీజేపీనే అని, ప్రధానిగా మోదీ హ్యాట్రిక్ సాధించడం ఖాయమని ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు కె. లక్ష్మణ్ ధీమా వ్యక్తంచేశారు. ఆదివారం ముషీరాబాద్, గాంధీనగర్ డివిజన్ సబర్మతి నగర్, అరుంధతి నగర్, దోబిఘాట్, వీవీ గిరినగర్, ఆంధ్ర చౌరస్తాతో పాటు పలు బస్తీల్లో స్థానిక కార్పొరేటర్ పావని వినయ్ కుమార్ తో కలిసి ఇంటింటికి బీజేపీ పాదయాత్ర చేపట్టారు. 

సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డిని గెలిపించాలని ప్రజలను కోరారు. అనంతరం లక్ష్మణ్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రజలకు చేసిన అన్యాయాన్ని తిప్పి కొట్టి బీజేపీ ప్రభుత్వానికి పట్టం కట్టేందుకు ఎదురు చూస్తున్నారని పేర్కొన్నారు.  రాజ్యాంగం రద్దు, రిజర్వేషన్లు ఎత్తివేస్తారని చేసే బూటకపు ప్రచారాలను నమ్మొద్దని సూచించారు. ప్రచారంలో పూసరాజు, వినయ్ కుమార్, రమేష్ రామ్, గోపాల్ రెడ్డి, రత్న సాయిచంద్, శ్రీకాంత్, ఉమేష్, విజయలక్ష్మి, సంధ్యారాణి, పూర్ణ పాల్గొన్నారు. 

©️ VIL Media Pvt Ltd.

2024-05-06T03:30:11Z dg43tfdfdgfd