ప్రశ్నిస్తున్నందుకే కేసీఆర్ ప్రచారాన్ని ఆపారు: మాజీ మంత్రి హరీశ్రావు

ప్రశ్నిస్తున్నందుకే కేసీఆర్ ప్రచారాన్ని ఆపారు: మాజీ మంత్రి హరీశ్రావు

సిద్దిపేట, వెలుగు: మోదీ మత విద్వేషాలు రెచ్చగొట్టినా, రేవంత్ రెడ్డి బూతులు మాట్లాడినా అవి ఎన్నికల కమిషన్ కు కనిపించవని..కానీ కేసీఆర్​ప్రశ్నిస్తూ గట్టిగా కొట్లాడుతుంటే మాత్రం ఆయన ప్రచారాన్ని ఆపుతున్నారని మాజీ మంత్రి హరీశ్​రావు మండిపడ్డారు.

బుధవారం రాత్రి మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డికి మద్దతుగా సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు రోడ్ షో మాట్లాడారు. కేసీఆర్​బస్సు యాత్ర చేస్తానంటే గజ గజ వణుకుతున్నారని , రెండు రోజులు ప్రచారాన్ని అపినంత మాత్రాన ఏమవుతుందని, ఆయన ప్రజల గుండెల్లో ఉన్నారన్నారు.

సీఎం రేవంత్ రెడ్డి దిగజారి ప్రవర్తిస్తున్నారని, ఆయన కేసీఆర్​ను అంటే మనందరినీ అన్నట్టేనని, కేసీఆర్​లేకుంటే తెలంగాణ వచ్చేదా జిల్లాలు అయ్యేవా అని అన్నారు. ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు గుణపాఠం చెప్పి కారు గుర్తుకు ఓటెయ్యాలని పిలుపునిచ్చారు.

©️ VIL Media Pvt Ltd.

2024-05-02T03:14:36Z dg43tfdfdgfd