బీజేపీ ఎమ్మెల్యే కూతురు లంచావతారం

బీజేపీ ఎమ్మెల్యే కూతురు లంచావతారం

పన్నా: మధ్యప్రదేశ్​లో ​బీజేపీ ఎమ్మెల్యే కూతురు ఓ కాంట్రాక్టర్​ నుంచి లంచం తీసుకుంటూ లోకాయుక్తకు పట్టుబడింది. హట్టా నియోజకవర్గ ఎమ్మెల్యే ఉమా ఖాటిక్ కూతురు, అమంగాంగ్ నగర పరిషత్ ప్రెసిడెంట్ సారిక ఖాటిక్.. రాఘవేంద్ర రాజ్ మోదీ అనే కాంట్రాక్టర్ నుంచి తన ఆఫీసులో రూ.30 వేలు లంచం తీసుకుంటుండగా లోకాయుక్త అధికారులు పట్టుకున్నారు. 

రూ.1.30 లక్షల పైచిలుకు బిల్లును క్లియర్ చేయడానికి సారిక ఖాటిక్ రాఘవేంద్ర రాజ్ మోదీని రూ.40 వేలు లంచం డిమాండ్ చేసింది. అందులో రూ.10వేలు అతడు చెల్లించాడు. మిగిలిన రూ.30 వేల కోసం ఆమె డిమాండ్​ చేయడంతో బాధితుడు ఏప్రిల్ 29న లోకాయుక్తకు ఫిర్యాదు చేశాడు. అధికారుల సూచనతో గురువారం నగర పరిషత్‌‌లోని తన ఆఫీసులో ఆమెకు రూ.30 వేలు లంచం ఇస్తుండగా లోకాయుక్త అధికారులు పట్టుకొని అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశారు.

 కాగా, తాను గ్రామీణ పౌర సంస్థకు అధ్యక్షుడిగా ఉన్నప్పటి నుంచి తన బిల్లులను క్లియర్ చేయడానికి సారిక ఖాటిక్​ కమీషన్‌‌ను తీసుకుంటున్నదని బాధితుడు ఆరోపించారు. మొదట్లో రూ.5 వేలు డిమాండ్ చేసిందని, చివరికి నెలకు రూ.10 వేలు డిమాండ్ చేయడం ప్రారంభించిందని ఆయన పేర్కొన్నాడు. అయితే, తాను రాజకీయ కుట్రకు బలైపోయానని సారిక మీడియాకు వివరించారు. వారు ఏడాదిన్నరగా తన వెంటే ఉన్నారని, చివరికి తనపైనే కుట్ర చేశారని సారిక చెప్పారు.

©️ VIL Media Pvt Ltd.

2024-05-04T03:07:25Z dg43tfdfdgfd