బీజేపీ చేతిలో కేసీఆర్ ఓడిపోలేదా : కిషన్ రెడ్డి
హైదరాబాద్: పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఒక్క సీటు గెలవన్న కేసీఆర్.. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి చేతిలో ఓడిపోయిన విషయం మర్చిపోయారా అని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ఇవాళ మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బీజేపీ గురించి మాట్లాడే హక్కు అసలు కేసీఆర్కు లేనే లేదని ఫైర్ అయ్యారు.
సికింద్రాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి పద్మారావు గౌడ్ తనకు మంచి మిత్రుడని చెప్పారు. పద్మారావు గౌడ్ ను బీఆర్ఎస్ నుంచి బలవంతంగా తనపై పోటీకి దించారని అన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస రెండు పార్టీల డీఎన్ఏ ఒక్కటేనని ఆయన విమర్శించారు. దేశ ప్రజలు మళ్లీ ప్రధాని మోడీకే పట్టం కట్టబోతున్నారన్నారు. తెలంగాణలో బీజేపీ మెజార్టీ ఎంపీ సీట్లు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
©️ VIL Media Pvt Ltd. 2024-04-24T12:59:40Z dg43tfdfdgfd