బీజేపీ మూడోసారి అధికారంలోకి వస్తది : కమలచంద్ర భంజ్ దేవ్

బీజేపీ మూడోసారి అధికారంలోకి వస్తది : కమలచంద్ర భంజ్ దేవ్

  • బీజేపీ జాతీయ నాయకుడు పొంగులేటి, బస్తర్ మహారాజ్ కమలచంద్ర భంజ్ దేవ్
  • వైరాలో భారీ బైక్ ర్యాలీ, రోడ్​షో 

వైరా, వెలుగు : ప్రధాని మోదీ నాయకత్వంలో మూడోసారి బీజేపీ ప్రభుత్వం అధికారం చేపట్టడం ఖాయమని, బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోద్ రావు విజయంతోనే ఖమ్మం అభివృద్ధి చెందుతుందని ఆ పార్టీ జాతీయ నాయకులు పొంగులేటి సుధాకర్ రెడ్డి, బస్తర్ మహారాజ్ కమలచంద్ర భంజ్ దేవ్ అన్నారు. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలో బీజేపీ ఎంపీ అభ్యర్థి వినోద్​రావు విజయాన్ని కాంక్షిస్తూ మంగళవారం బైక్ ర్యాలీతో పాటు రోడ్ షో నిర్వహించారు. వైరా శాస్తానగర్ లోని సాయిబాబా ఆలయంలో మాజీ మంత్రి, బస్తర్ మహారాజ్ కమలచంద్ర భంజ్ దేవ్ తో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. 

రోడ్ షో ప్రారంభం సందర్భంగా వినోద్ రావు, పొంగులేటి సుధాకర్ రెడ్డి డప్పు కొట్టి జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. రాష్ట్రంలో మోసపూరిత వాగ్దానాలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని పొంగులేటి విమర్శించారు. కమలచంద్ర భంజ్ దేవ్ మాట్లాడుతూ ఛత్తీస్​గఢ్​లో కూడా కాంగ్రెస్ తప్పుడు వాగ్దానాలతో మోసం చేసిందని, ప్రజలు ఇంకా ఆ పార్టీని నమ్మితే నష్టపోక తప్పదన్నారు. ఆయా కార్యక్రమాల్లో బీజేపీ జిల్లా అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి శ్యాం రాథోడ్, మండల అధ్యక్షులు భద్రయ్య, ప్రధాన కార్యదర్శి మనుబోలు వెంకట కృష్ణ, పాపకంటి నరేశ్, వెంకీ యాదవ్, శ్రీను, రామారావు పాల్గొన్నారు. 

©️ VIL Media Pvt Ltd.

2024-05-08T03:52:05Z dg43tfdfdgfd