బీజేపీకి ఓటేస్తే బానిస బతుకులు అవుతాయి : కొండా సురేఖ

బీజేపీకి ఓటేస్తే బానిస బతుకులు అవుతాయి : కొండా సురేఖ

బీజేపీకి ఓటేస్తే బానిస బతుకులు అవుతాయని మంత్రి కొండా సురేఖ అన్నారు.  ఒక్కసారి ఆలోచన చేసి ఓటు వేయండని కోరారు. ప్రైవేటీకరణను పెంచి పోషిస్తున్న ప్రధాని మోదీకి పేదల కష్టాలు, సంక్షేమం, చదువులు, వైద్యం కనిపించవని ఫైర్ అయ్యారు. సంగారెడ్డిలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో కొండా సురేఖ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేవలం ఆదాని, అంబానీలకు ఏం కావాలో అని మాత్రమే మోదీ చూస్తారని విమర్శించారు.

 ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్న సమయంలోనే అనేక పరిశ్రమలను మెదక్ లో నెలకొల్పారని చెప్పారు. రాజీవ్ గాంధీ హాయంలోనే ఐటి రంగానికి బీజం పడిందని చెప్పారు. 25 ఏళ్లు వెనుకబాటుకు గురైన మెదక్ ప్రాంత అభివృద్ధి కాంగ్రెస్ ద్వారానే సాధ్యమవుతుందని తెలిపారు.  ఎంపీ అభ్యర్థి నీలం మధు గెలుపు కోసం  కృషి చెయండని కోరారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి హామీ నెరవేరుస్తుందని చెప్పారు మంత్రి కొండా సురేఖ.

    ©️ VIL Media Pvt Ltd.

2024-05-04T11:08:45Z dg43tfdfdgfd