బీజేపీపై తప్పుడు ప్రచారం చేస్తున్రు : రామచందర్ రావు

బీజేపీపై తప్పుడు ప్రచారం చేస్తున్రు : రామచందర్ రావు

బషీర్ బాగ్/ముషీరాబాద్, వెలుగు: రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు బీజేపీపై దుష్ప్రచారాలు చేస్తూ, ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మాజీ ఎమ్మెల్సీ, బీజేపీ సీనియర్ నాయకుడు రామచందర్ రావు ఆరోపించారు. అమిత్ షా స్పీచ్ ను మార్ఫింగ్ చేసిన కేసులో ఢిల్లీ పోలీసులు సీఎం రేవంత్ రెడ్డి కు నోటీసులు ఇవ్వడంలో బీజేపీ ప్రమేయం ఏమీ లేదన్నారు. నోటీసులు ఇవ్వడాన్ని జీర్ణించుకోలేని కాంగ్రెస్ నాయకులు రాష్ట్రంలో బీజేపీ ఫ్లెక్సీలను, బ్యానర్లను చించివేస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని బుధవారం డీజీపీని కలిసి ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్లపై దుష్ప్రచారం చేస్తోందని రాజ్యసభ సభ్యుడు కె.లక్ష్మణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ ప్రభుత్వం రిజర్వేషన్లను ఎత్తివేయదని స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం ఆయన ముషీరాబాద్ లోని నాగమయ్యకుంటలో మాట్లాడారు.

©️ VIL Media Pvt Ltd.

2024-05-02T03:14:36Z dg43tfdfdgfd