భర్తకు మద్దతుగా సీతారెడ్డి ప్రచారం
వికారాబాద్, వెలుగు: చేవెళ్ల కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం రంజిత్రెడ్డి తరఫున ఆయన సతీమణి గడ్డం సీతారెడ్డి శుక్రవారం వికారాబాద్ జిల్లా కేంద్రంలోని శివరాంనగర్ కాలనీలో డోర్టు డోర్ ప్రచారం నిర్వహించారు. హస్తం గుర్తుపై ఓటు వేసి రంజిత్రెడ్డిని గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ గెలిస్తే అర్హులందరికీ ఆరు గ్యారంటీలు అందుతాయన్నారు. ఆమె వెంట మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్లపల్లి మంజుల రమేశ్కుమార్, కౌన్సిలర్లు మోముల స్వాతి రాజ్ కుమార్, గాయత్రి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
©️ VIL Media Pvt Ltd. 2024-05-04T03:37:37Z dg43tfdfdgfd