మంత్రి ఉత్తమ్​కుమార్​ రెడ్డికి వడదెబ్బ

మంత్రి ఉత్తమ్​కుమార్​ రెడ్డికి వడదెబ్బ

  • మూడు రోజులుగా ప్రచారానికి దూరం
  • హైదరాబాద్​లోని ఇంట్లో విశ్రాంతి

నల్గొండ, వెలుగు : రాష్ట్ర ఇరిగేషన్​శాఖ మంత్రి నలమాద ఉత్తమ్​కుమార్​ రెడ్డికి వడదెబ్బ తగిలింది. దీంతో ఆయన మూడు రోజుల నుంచి ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉన్నారు. హైదరాబాద్​లో ఆయన నివాసంలోనే రెస్ట్​ తీసుకుంటుండగా, ఆయన వ్యక్తిగత డాక్టర్లు పర్యవేక్షిస్తున్నారు. కొద్దిరోజుల క్రితం హుజూర్​నగర్​లో ఎంపీ అభ్యర్థి రఘువీర్​రెడ్డితో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మంత్రి ఉత్తమ్​అలసటగా ఉందని ప్రచారం మధ్యలో నుంచే వెళ్లిపోయారు. వడదెబ్బ తాకడంతో అప్పటి నుంచి వ్యక్తిగత డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నారు. ప్రస్తుతం ఉత్తమ్​ బదులుగా ఆయన భార్య కోదాడ ఎమ్మెల్యే పద్మావతి ప్రచార బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ప్రస్తుతం ఉత్తమ్​ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని, త్వరలోనే ప్రచారంలో పాల్గొంటారని మంత్రి కార్యాలయ సిబ్బంది తెలిపారు.

©️ VIL Media Pvt Ltd.

2024-05-08T04:07:07Z dg43tfdfdgfd