మధుయాష్కీకి త్రుటిలో తప్పిన ప్రమాదం

మధుయాష్కీకి త్రుటిలో తప్పిన ప్రమాదం

  • టైర్లు పేలిపోయి భారీ కుదుపునకు లోనైన కారు

యాదాద్రి, వెలుగు: పీసీసీ క్యాంపెయిన్ కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధు యాష్కీకి త్రుటిలో ప్రమాదం తప్పింది. శనివారం యాద్రాది జిల్లా ఆలేరులో ఈ ఘటన జరిగింది. మాజీ ఎంపీ బలరాం నాయక్ తల్లి అంత్యక్రియల్లో పాల్గొనడానికి మధు యాష్కీ వరంగల్ కు బయలుదేరారు. యాద్రాది జిల్లా ఆలేరు వద్దకు రాగానే బైక్ పై ఇద్దరు వ్యక్తులు రాంగ్ రూట్ లో ఎదురుగా వచ్చారు. అప్రమత్తమైన డ్రైవర్ కారును పక్కకు తప్పించే క్రమంలో డివైడర్ ను ఢీ కొట్టింది. దీంతో కారు రెండు టైర్లు పేలిపోయి భారీ కుదుపునకు లోనైంది. ఈ ఘటనలో మధుయాష్కీతో సహా కారులో ఉన్న వారికీ స్వల్పంగా గాయాలయ్యాయి. 

©️ VIL Media Pvt Ltd.

2024-05-06T01:45:08Z dg43tfdfdgfd