UTTAR PRADESH: మరొకరితో ప్రియుడికి పెళ్లి.. వరుడిపై యాసిడ్‌తో దాడిచేసిన ప్రియురాలు

ప్రియుడు మరో యువతితో పెళ్లికి సిద్దమైన విషయం తెలిసి తట్టుకోలేకపోయింది. ఆగ్రహంతో రగిలిపోయిన ఆమె.. యాసిడ్ దాడి పోసింది. దాడిలో గాయపడిన యువకుడ్ని బందువులు ఆస్పత్రికి తరించారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌ బలియా జిల్లా బన్స్‌డిహ్‌లోని డుమ్రీలో ఏప్రిల్ 23న చోటు చేసుకుంది. ఆ వివరాళ్లోకి వెళ్తే.. డుమ్రీకి చెందిన యువతి.. యువకుడు ప్రేమించుకున్నారు. అయితే, వీరి ప్రేమను ఇరు కుటుంబాలు ఒప్పుకోలేదు. దీనిపై గొడవలు జరగడంతో పెద్ద మనుషుల వద్ద పంచాయితీ పెట్టి.. రాజీకొచ్చారు. ఎవరి బతుకు వాళ్లు బతకాలని పెద్దలు తీర్పు ఇచ్చారు. వివాదం సద్దుమణగడంతో యువకుడు ఉపాధి కోసం వేరే ప్రాంతానికి వెళ్లాడు.

ఈ క్రమంలో మరో అమ్మాయితో సంబంధం ఖాయం చేసిన ఆ యువకుడి తల్లిదండ్రులు... ఏప్రిల్ 22న పెళ్లికి ముహూర్తం నిర్ణయించారు. తనను కాదని వేరే యువతిని పెళ్లిచేసుకుంటున్నాడని తెలిసిన ప్రియురాలు.. పగతో రగిలిపోయింది. మంగళవారం ఊరేగింపుగా వస్తున్న వరుడిపై సమయం చూసి యాసిడ్ దాడి చేసింది. ఈ దాడిలో అతడికి గాయాలు కావడంతో తక్షణమే స్పందించిన కుటుంబసభ్యులు.. చికిత్స కోసం జిల్లా ఆస్పత్రికి తరలించారు. వరుడి బంధువుల యువతిని పట్టుకుని కొట్టి, పోలీసులకు అప్పగించారు. అదృష్టవశాత్తు అతడి పెద్దగా గాయాలు కాలేదని, చికిత్స తర్వాత ఇంటికి పంపినట్టు వైద్యులు తెలిపారు.

మరోవైపు, బాధితుడి తల్లి ఫిర్యాదు మేరకు ఐపీసీ సెక్షన్ 326బి కింద కేసు నమోదు చేసినట్లు స్థానిక పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ మున్నా లాల్ యాదవ్ తెలిపారు. అలాగే ఈ ఘటనపై విచారణ జరుగుతోందని, చట్టపరంగా చర్యలు తీసుకుంటామని పోలీస్ స్టేషన్ హెడ్ అఖిలేష్ చంద్ర పాండే అన్నారు. అయితే, యువతిని వరుడు బంధువులు కొట్టిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమెను కొందరు యువకులు కొట్టేందుకు ప్రయత్నిస్తుంటే.. ఇద్దరు మహిళలు వారిని వారిస్తున్నారు.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-04-25T06:33:00Z dg43tfdfdgfd