మహారాష్ట్ర కాంగ్రెస్ నేత సంచనల వ్యాఖ్యలు

మహారాష్ట్ర కాంగ్రెస్ నేత సంచనల వ్యాఖ్యలు

మహారాష్ట్ర కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి సంచలన వ్యాక్యలు చేశారు. యావత్ భారతదేశాన్ని కుదిపేసిన ముంబై ఉగ్రదాడి సమయంలో యాంటీ టెర్రరిజం స్వ్కాడ్ మాజీ చీఫ్ హేమంత్ కర్కరేని చనిపోయారు. అయితే ఆయన్ని చంపింది టెర్రరిస్ట్ అజ్మల్ కసబ్ కాదని, ఆర్ఎస్ఎస్ తో సబంధం ఉన్న ఓ పోలీస్ అధికారి అని మహారాష్ట్ర కాంగ్రెస్ నేత విజయ్ నామ్‌దేవ్‌రావ్ వాడెట్టివార్ ఆరోపించారు. ప్రచారంలో ఆయన ముంబై నార్త్ సెంట్రల్ బీజేపీ అభ్యర్థి ఉజ్వల్ నికమ్‌పై విమర్శలు గుప్పించారు.

అసలు కసబ్‌కి ఎవరైనా బిర్యానీ ఇస్తారా? ఈ విషయాన్ని నికమ్ ఆ తర్వాత ఒప్పుకున్నాడు. అసలు అతను ఎలాంటి లాయర్? కోర్టులో సాక్ష్యం కూడా చెప్పని దోశద్రోహి అతను. ముంబై పోలీస్ అధికారి హేమంత్‌ను బలిగొన్న బుల్లెట్.. కసబ్ తుపాకీ నుంచి వచ్చింది కాదు, ఆర్ఎస్ఎస్ విధేయుడైన ఓ పోలీస్ అధికారి నుంచి వచ్చిందని అన్నారు. 

ఈ నిజాన్ని దాచిపెట్టిన ద్రోహికి బీజేపి టికెట్ ఇస్టుంటే, ఇలాంటి ద్రోహుల్ని ఆ పార్టీ ఎందుకు మద్దతు ఇస్తోందని విజయ్ నామ్‌దేవ్‌రావ్ ప్రశ్నించారు. ప్రస్తుతం ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. అజ్మల్ కసబ్‌కు మరణశిక్ష పడిన ఉగ్రదాడి విచారణ టైంలో ఉజ్వల్ నికమ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా పనిచేస్తున్నారు.

  ©️ VIL Media Pvt Ltd.

2024-05-05T17:13:34Z dg43tfdfdgfd