మీటింగ్‌లోనే కాంగ్రెస్ కార్యకర్తని వెంటాడి చంపిండు

మీటింగ్‌లోనే కాంగ్రెస్ కార్యకర్తని వెంటాడి చంపిండు

రంగారెడ్డి జిల్లా: రాజేంద్రనగర్ లో దారుణం చోటుచేసుకుంది. అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధి హసన్ నగర్ లో జరుగుతున్న కాంగ్రెస్ పార్టీ మీటింగ్ లో ఆ పార్టీ నాయకుడిని ఓ వ్యక్తి దాడి చేసి హత్య చేశాడు. మీటింగ్ కు వచ్చిన జనాలు అందరూ చూస్తుండగానే దుండగుడు గొంతు కోసి కిరాతకంగా హత్య చేశాడు. కళ్ల ముందే హత్య జరగడంతో మీటింగ్ లోని జనాలు భయంతో పరుగులు తీశారు. పోలీసులకు సమాచారం ఇవ్వగా హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. చనిపోయిన వ్యక్తి క్యాబ్ డ్రైవర్‌ మక్బుల్ గా పోలీసులు గుర్తించారు. పాత కక్ష్యలే హత్యకు గల కారణాలని సమాచారం. నింధితుడు స్క్రాప్ బిజినెస్ చేసుకునే వ్యక్తిగా స్థానికులు చెబుతున్నారు. వ్యాపార లావాదేవీల కారణంగా ఈ హత్య జరిగిందా అన్న కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. ఇంకా పూర్తి వివరాలు తెలయాల్సి ఉంది. 

©️ VIL Media Pvt Ltd.

2024-05-04T17:25:02Z dg43tfdfdgfd