మెట్రో పిల్లర్ ను ఢీకొన్న లారీ.. ఇద్దరు మృతి

మెట్రో పిల్లర్ ను ఢీకొన్న లారీ.. ఇద్దరు మృతి

డ్రైవింగ్ చేసే సమయంలో అలర్ట్ గా లేకపోతే ప్రాణానికే ముప్పు వాటిల్లే అవకాశం ఉంది. డ్రైవర్ల నిర్లక్ష్యం వల్ల తమ ప్రాణాలు కోల్పోవటమే కాకుండా ఎదుటివారి ప్రాణాలను కూడా బలి తీసుకుంటూ ఉంటారు. నిద్రమత్తులో డ్రైవింగ్ చేయటం వల్ల రెప్పపాటు కాలంలో ఘోర ప్రమాదాలు జరిగిన సంఘటనలు చాలా ఉన్నాయి. కేరళలో ఇలాంటి ఘటన చోటు చేసుకుంది. మెట్రో పిల్లర్ ను లారీ ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతి చెందారు.

కొచ్చిలోని ఆలువ ప్రాంతంలో చేపల లోడ్ తో వెళ్తున్న లారీ మెట్రో పిల్లర్ ను ఢీకొట్టడంతో ఏపీకి చెందిన ఇద్దరు మృతి చెందారు.లారీ ఎర్నాకులం నుండి వస్తున్నట్లుగా సమాచారం. డ్రైవర్ నిద్ర మత్తులో ఉండటమే ఈ ఘటనకు కారణంగా తెలుస్తోంది. లారీ మెట్రో పిల్లర్ ను ఢీకొన్న సమయంలో వెనుక వస్తున్న కారు లారీని ఢీకొని అందులోని గాయపడ్డాడు. ఈ ఘటనలో మృతి చెందిన వారిని మల్లి, హబీబ్ బాద్షాగా గుర్తించారు.

©️ VIL Media Pvt Ltd.

2024-05-02T13:16:16Z dg43tfdfdgfd