మే15లోపు 90 శాతం పనులు పూర్తికావాలి : ప్రతీక్​ జైన్

మే15లోపు 90 శాతం పనులు పూర్తికావాలి : ప్రతీక్​ జైన్

భద్రాచలం, వెలుగు : ఆశ్రమ పాఠశాలలు, హాస్టళ్లలో మౌలిక సదుపాయాల ఏర్పాటుకు చేపట్టిన పనులు ఈనెల15లోపు 90శాతం పూర్తి చేయాలని ఐటీడీఏ పీవో ప్రతీక్​జైన్​ అధికారులను ఆదేశించారు. స్పెషల్​ ఆఫీసర్లతో మంగళవారం ఏర్పాటు చేసిన మీటింగ్​లో ఆయన మాట్లాడారు. స్కూళ్లు తెరిచే నాటికి సదుపాయాలు సిద్ధంగా ఉండాలన్నారు. గదుల్లో గాలి, వెలుతురు చక్కగా ఉండేలా తీర్చిదిద్దాలని చెప్పారు. టాయిలెట్లు, బాత్ రూమ్​ల్లో నీటి సదుపాయం, మైనర్​ రిపేర్లు పూర్తి చేయాలని, అవసరమైన చోట మంచినీటి బోర్లు ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో ఏపీవో జనరల్​ డేవిడ్​రాజ్, డీడీ ట్రైబల్​ వెల్ఫేర్​ మణెమ్మ తదితరులు పాల్గొన్నారు.

 నాటు వైద్యం జోలికి పోనీయకుండా చూడాలి

మారుమూల ఆదివాసీ గిరిజన గ్రామాల్లో గిరిజనులు మూఢనమ్మకాలతో నాటు వైద్యం జోలికి పోనీయకుండా మెడికల్ ఆఫీసర్లు చూడాలని ఐటీడీఏ పీవో ప్రతీక్​జైన్​ ఆదేశించారు. మంగళవారం మెడికల్ ఆఫీసర్లతో ఆయన రివ్యూ నిర్వహించారు. జిల్లాలో వైరల్​ ఫీవర్లు ప్రబలుతున్నందున తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు. ఆశావర్కర్లు ఇంటింటికీ వెళ్లి బ్లడ్​ శాంపిల్స్ సేకరించి టెస్టింగ్​కు పంపించాలన్నారు. ఆర్​ఎంపీలు పరిధిని దాటి వైద్యం అందిచొద్దని చెప్పారు. సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేసి మూఢనమ్మకాల వైపు ఆదివాసీలు వెళ్లకుండా చైతన్యపరచాలన్నారు. గర్భిణులు, చిన్నారులకు అందించే వైద్యం విషయంలో అలర్ట్​ ఉండాలన్నారు. సమావేశంలో అడిషనల్ డీఎం​హెచ్​వో భాస్కర్​, డిప్యూటీ డీఎంహెచ్​వో రాజ్​కుమార్, జిల్లాలోని మెడికల్ ఆఫీసర్లు పాల్గొన్నారు. 

©️ VIL Media Pvt Ltd.

2024-05-08T05:07:18Z dg43tfdfdgfd