మే7న మూడో దశ పోలింగ్.. 94 ఎంపీ స్థానాలకు ఎన్నికలు

మే7న మూడో దశ పోలింగ్.. 94 ఎంపీ స్థానాలకు ఎన్నికలు

న్యూఢిల్లీ:  లోక్ సభ ఎన్నికల్లో భాగంగా ఈ నెల 7న మూడో దశ పోలింగ్​ జరగనున్నది. దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లోని 94 ఎంపీ స్థానాలకు మంగళవారం ఎన్నికలు జరగనున్నాయి. గోవాలో 2 , గుజరాత్​ 26, చత్తీస్​గఢ్​ లో 7, కర్నాటకలో 14, అస్సాంలో 4, బిహార్ లో​ 5, మధ్యప్రదేశ్ లో​ 8, మహారాష్ట్రలో 11, యూపీలో 10, పశ్చిమ బెంగాల్ లో​ 4, జమ్మూకాశ్మీర్​ లో 1, దాద్రానగర్​ హవేలీ, డామన్​ డయ్యూలోని 2 లోక్​సభ స్థానాలకు పోలింగ్​ జరగనున్నది. 

 

థర్డ్ ఫేజ్ లో తలపడనున్న ప్రముఖులు వీళ్లే.. 

మూడో దశ ఎన్నికల్లో గుజరాత్​లోని గాంధీనగర్​నుంచి కేంద్ర మంత్రి అమిత్​ షా తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. అమిత్​ షాతోపాటు శివరాజ్​సింగ్​ చౌహాన్​ (విదిశ), జ్యోతిరాదిత్య సింధియా (గుణ), ప్రహ్లాద్​ జోషి (ధార్వాడ్​), బసవరాజ్​ బొమ్మై (హవేరీ), బద్రుద్దీన్​ అజ్మల్​ (ధుబ్రీ)లాంటి ప్రముఖులు ఈ విడత ఎన్నికల బరిలో ఉన్నారు. కాగా, ఆదివారం సాయంత్రంతో 12 రాష్ట్రాలు/యూటీల్లోని 94 నియోజకవర్గాల్లో ప్రచారం ముగిసింది.

    ©️ VIL Media Pvt Ltd.

2024-05-06T02:15:00Z dg43tfdfdgfd