మోదీ కులపెద్దకు ఎక్కువ..మతగురువుకు తక్కువ: భవానీ రెడ్డి
ప్రధాని మోదీపై కాంగ్రెస్ అధికార ప్రతినిధి భవానీ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. రాహుల్ గాంధీని పాకిస్తాన్ ప్రధానమంత్రిగా కోరుకుంటున్నారని మోడీ చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు. లాంటి వ్యాఖ్యలు మోడీ నుంచి వస్తాయనిఊహించలేదన్నారు. నరేంద్ర మోడీ కుల పెద్దకు ఎక్కువ మత గురువుకు తక్కువ అన్నట్లు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ప్రధాని స్థాయి వ్యక్తి దిగజారి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమన్నారు.
1965లో పాకిస్తాన్ మీద కాంగ్రెస్ యుద్ధం చేసిందన్నారు భవానీ రెడ్డి. పాకిస్తాన్, బంగ్లాదేశ్ లను కాంగ్రెస్ విడదీసిందన్నారు. పాక్ మాజీ ప్రధాని ముషారఫ్ ని పిలిచి ఆతిథ్యం ఇచ్చింది మీరు కాదా ? అని మోదీని ప్రశ్నించారు. ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే గారు చిన్న స్థాయి నుంచి పైకి వచ్చారని తెలిపారు. ప్రధాని విధానపరమైన అంశాలపై మాట్లాడితే బాగుంటదని సూచించారు. దేశానికి ఏం చేశారో మోడీ ప్రజలకు వివరించాలని చెప్పారు. రెండుసార్లు మిమ్మల్ని ప్రధానిని చేశారు కానీ.. ఈ సారి మళ్ళీ వచ్చే అవకాశం లేదన్నారు. మళ్లీ అవకాశం ఇస్తే కూడా ప్రజలకు ఏమి చేస్తారో చెప్పాలన్నారు. కాశ్మీర్ నుండి కన్యాకుమారి , మణిపూర్ నుంచి ముంబై వరకు రాహుల్ గాంధీ న్యాయ్ యాతర చేశారని తెలిపారు.
©️ VIL Media Pvt Ltd. 2024-05-05T10:27:29Z dg43tfdfdgfd