మోదీ మూడో సారి ప్రధాని కావాలని కలలు కంటున్నారు : పొంగులేటి
మోదీ మూడో సారి ప్రధాని కావాలని కలలు కంటున్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విమర్శించారు. రాజ్యాంగం మార్చాలనే బీజేపీని దానికి తొత్తుగా ఉన్న బీఅర్ఎస్ కు బుద్ధి చెప్పాలని కోరారు. నామా నాగేశ్వరరావు గెలిస్తే కేంద్రంలో మంత్రిని చేస్తానని కేసీఅర్ చేసిన వ్యాఖ్యలు వారి లాలూచీకి నిదర్శనమని అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం కాంగ్రెస్ పార్టీ సభలో పొంగులేటి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఅర్ నీ సీఎం రేవంత్ రెడ్డి దగ్గరికి రానివ్వరు అందుకే బీజేపీతో కేసీఅర్ దగ్గరవ్వాలని చూస్తున్నారని చెప్పారు. రాహుల్ గాంధీని ప్రధాన మంత్రి చేయాలంటే కాంగ్రెస్ ను గెలిపించాలని కోరారు. ఈ నెల 13 న జరిగే లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి రామ సహాయం రఘురాం రెడ్డికి సీపీఎం, సీపీఐ పార్టీల నేతలు మద్దతుగా నిలిచారని చెప్పారు. ఇందిరమ్మ రాజ్యంలో పోడు రైతులకు న్యాయమని వెల్లడించారు. గ్యారెంటీలు అమలు కాంగ్రెస్ ప్రభుత్వం ముందుందని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.
©️ VIL Media Pvt Ltd. 2024-05-04T10:08:34Z dg43tfdfdgfd