యూనివర్సిటీలకు సెలవులు ఇవ్వాలి : రామకృష్ణ
ముషీరాబాద్, వెలుగు: నీళ్లు, కనీస వసతులు లేవని హాస్టళ్లకు సెలవులు ప్రకటిస్తే స్టూడెంట్లు కాలేజీలకు ఏ విధంగా వెళ్తారని బీసీ విద్యార్థి సేన రాష్ట్ర అధ్యక్షుడు వేముల రామకృష్ణ ప్రశ్నించారు. యూనివర్సిటీలు, అనుబంధ కాలేజీలకు వెంటనే సెలవులు ప్రకటించాలని డిమాండ్ చేశారు. విద్యానగర్ బీసీ భవన్ లో హాస్టల్ విద్యార్థుల సమస్యలపై బుధవారం సమావేశం నిర్వహించారు. వేముల రామకృష్ణ మాట్లాడుతూ.. మండుతున్న ఎండల్లో స్టూడెంట్లు కాలేజీలకు వెళ్లలేకపోతున్నారని చెప్పారు. యూనివర్సిటీలు, కాలేజీల యాజమాన్యాలకు స్టూడెంట్లు సమస్యలు కనపడతలేవా అని ప్రశ్నించారు. పెండింగ్ స్కాలర్షిప్ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్చేశారు.
©️ VIL Media Pvt Ltd. 2024-05-09T03:34:33Z dg43tfdfdgfd