యువతను మోసం చేసి బీజేపీ రెండు సార్లు గద్దెనెక్కింది : విజయరమణారావు

యువతను మోసం చేసి బీజేపీ రెండు సార్లు గద్దెనెక్కింది : విజయరమణారావు

 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని యువతను మోసం చేసి బీజేపీ రెండు సార్లు  గద్దెనెక్కిందని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. ఎంపీగా గడ్డం వంశీని గెలిపిస్తే  పరిశ్రమలు తీసుకొచ్చి నిరుద్యోగ సమస్య పరిష్కరిస్తారన్నారు.  పెద్దపల్లిలో ఇవాళ పార్లమెంటు ఎన్నికల సన్నాహక సమావేశం సందర్బంగా చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామితో కలిసి పట్టణంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు.  అనంతరం ఎమ్మెల్యే విజయరమణారావు మాట్లాడుతూ  బీజేపీని చిత్తుగా ఓడించాలన్నారు.  శ్రీరాముని తలంబ్రాలు పంపిణీ  బీజేపీ ఎన్నికల స్టంటేనన్నారు. 

 మోడీ పాలనలో ధరలు  పెరిగాయన్నారు.  గడ్డం వంశీని  భారీ మెజారిటీతో గెలిపించాలన్నారు. ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ మాట్లాడుతూ సెమీ ఫైనల్లో కేసిఆర్ను ఓడించినట్లుగానే పార్లమెంటు ఎన్నికల్లో  బీజేపీని ఓడించి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలన్నారు. బీఆర్ఎస్, బీజేపీ  రెండు ఒకటే అన్నారు.  వంశీకృష్ణ ను గెలిపించుకునే  బాధ్యత కార్యకర్తలపై ఉందన్నారు. 

మంత్రి శ్రీధర్ బాబు సోదరుడు శ్రీనుబాబు మాట్లాడుతూ వంశీ గెలిచిన తర్వాత పెద్దపల్లి పార్లమెంటులో ఇండస్ట్రియల్ పార్కు నూటికి నూరు శాతం తీసుకువస్తామన్నారు.  అనంతంర పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ మాట్లాడుతూ  తనను గెలిపిస్తే పెద్దపల్లికి ప్రభుత్వ రంగ సంస్థలను తీసుకువస్తానని స్పష్టం చేశారు.

©️ VIL Media Pvt Ltd.

2024-05-08T12:23:03Z dg43tfdfdgfd