రూ.4 వేల 500 కోసం స్నేహితుడిని చంపేశాడు
నాసిక్ లో దారుణం జరిగింది. రూ. 4 వేల500 తిరిగి చెల్లించమని అడిగినందుకు స్నేహితుడిని హత్య చేశాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిపై, అతడికి సహకరించిన వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. స్నేహితుల మధ్య మోటార్సైకిల్ రిపేర్ డబ్బు వివాదమే ఈ హత్యకు దారి తీసింది.
సచిన్ సావంత్, మయూర్ కదమ్ ఇద్దరు స్నేహితులు. సచిన్ కు చెందిన బైక్ రిపేర్ చేయడానికి మయూర్ రూ. 9 వేల పెట్టుబడి పెట్టాడు. ఇందులో సగం అంటే రూ.4 వేల 500 సచిన్ తిరిగి ఇచ్చేశాడు. మిగిలిన సగం డబ్బును అడిగినందుకు మయూర్ ఆగ్రహానికి గురయ్యాడు. దీంతో సచిన్ను బైక్ పై నిర్మానుష ప్రాంతానికి తీసుకెళ్లిన మయూర్ అతని అనుచరులతో కలసి కర్రలు, ఇనుప రాడ్తో దాడికి దిగాడు. ఈ ఘటనలో సచిన్ తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు.
మొదటగా అనుమానస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టగా విచారణలో ఇది హత్య అని తేలింది. పోలీస్ ఇన్స్పెక్టర్ విక్రమ్ మోహితే నేతృత్వంలో విచారణ కొనసాగుతోంది. ప్రస్తుతం మయూర్ కదమ్ పరారీలో ఉన్నాడు. అతని కోసం, అతని సహచరుల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.
©️ VIL Media Pvt Ltd. 2024-04-23T13:26:07Z dg43tfdfdgfd