రాజ్యాంగాన్ని కాపాడాలంటే బీజేపీని ఓడించాల్సిందే : కూనంనేని

రాజ్యాంగాన్ని కాపాడాలంటే బీజేపీని ఓడించాల్సిందే : కూనంనేని

రాజ్యాంగాన్ని కాపాడాలంటే బీజేపీని ఓడించాల్సిందే అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివ రావు అన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎ స్ ఎగ్జాస్ట్ అయ్యిందని.. ఆపార్టీకి ఇప్పుడు తెలంగాణ సెంటిమెంట్ లేదని అన్నారు. బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో జరిగిన మీట్ ది ప్రెస్ లో కూనంనేని మాట్లాడారు. 'బీజేపీ దేశానికి ప్రమాదకరమన్నారు. ఆ పార్టీ నాయకులకు మించిన అవినీతిపరులు ఎవరూ లేరని విమర్శించారు. 

కేసీఆర్ కు, మోదీకి మధ్య తేడా ఏమీ లేదని కాకపోతే మోదీ పవర్ఫుల్ అయ్యి.. కేసీఆర్ లాంటోన్ని జేబుల్లో పెట్టుకున్నరని విమర్శించారు కూనంనేని. కేసీఆర్ కూడా ఉద్యమకారుల గొంతు నొక్కాడని ఆయన చేసిన దుర్మార్గాల వల్లే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయిందని తెలిపారు. కేసీఆర్ మమ్మల్ని మోసం చేసిండని కమ్యూనిస్టుల జోలికొస్తే ఎవరైనా పతనం కావాల్సిందేనని అన్నారు.

 ఆరు నెలలు కాకముందే కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు విరుచుపడుతున్నారు అసలు పదేండ్లలో నువ్వేం చేయలేదు కాదా? ప్రజలు ఏది మరి చిపోలేదని అన్నారు. తమ సపోర్టు లేకుండా కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఎన్నికల్లో గెలవలేదని రాష్ట్రంలో బీఆర్ఎస్ ఎగ్జా స్ట్రయ్యిందని విమర్శించారు. ఆపార్టీకి ఇప్పుడు తెలంగాణ సెంటిమెంట్ లేదని బీజేపీ. బీఆర్ఎస్ ని ఓడించాలని కోరారు. లోకల్ బాడీ ఎలక్షన్ల నుంచి తమ బలమెంటో చూపిస్తమని గౌరవప్రదంగా ఉంటేనే పొత్తులుంటాయని. లేకపోతే పోటీలు ఉంటాయని తెలిపారు కూనంనేని.

©️ VIL Media Pvt Ltd.

2024-05-07T09:19:13Z dg43tfdfdgfd