రాధా కిషన్ రావును కోర్టులో హాజరుపర్చనున్న పోలీసులు

రాధా కిషన్ రావును కోర్టులో హాజరుపర్చనున్న పోలీసులు

ఫోన్ ట్యాపింగ్  కేసులో అరెస్టైన.. మాజీ డీసీపీ రాధా కిషన్ రావును.. కాసేపట్లో కోర్టులో హాజరుపర్చనున్నారు పోలీసులు. బంజారాహిల్స్ లో పోలీసుల విచారణకు హాజరవుతున్నారు టాస్క్ ఫోర్స్, ఎస్ఐబి సిబ్బంది. నలుగురు సీఐలు, ఐదుగురు ఎస్ఐ లు, కానిస్టేబుల్స్ ను విచారించారు పోలీసులు. నిన్ననే(మార్చి 28) పలువురి స్టేట్మెంట్ ను రికార్డ్ చేసుకున్నారు పోలీసులు. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నారు టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు. నేడు(2024 మార్చి 29) తిరుపతన్న, భుజంగరావ్ లను కస్టడీకి తీసుకోనున్నారు పోలీసులు.

ఐదు రోజుల పాటు పోలీసులు కస్టడీ విచారణ చేయనున్నారు. ఎన్నికల సమయంలో అందరూ చేసిన మానిటరింగ్, సీజ్ చేసిన డబ్బులు, నేతలతో సంభాషణలపై ఆరా తీస్తున్నారు. రాధాకిషన్ అరెస్ట్ తో ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల సంఖ్య నాలుగుకు చేరింది.

©️ VIL Media Pvt Ltd.

2024-03-29T04:43:32Z dg43tfdfdgfd