రాయ్బరేలీలో రాహుల్ ఓడిపోతరు : అమిత్ షా
హుక్కేరి(కర్నాటక): రాహుల్ గాంధీ అమేథీ నుంచి పారిపోయి రాయ్బరేలీ నుంచి పోటీ చేస్తున్నారని, అయితే, అక్కడ బీజేపీ అభ్యర్థి చేతిలో ఆయన ఘోరంగా ఓడిపోబోతున్నారని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. శుక్రవారం కర్నాటకలోని బెలగావి జిల్లాలోని చిక్కోడి లోక్సభ బీజేపీ అభ్యర్థి అన్నాసాహెబ్ జొల్లే తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ప్రధాని మోదీ చంద్రయాన్ మిషన్ను ఒక్కసారి మాత్రమే లాంచ్ చేశారు. కానీ, సోనియా గాంధీ రాహుల్ బాబాను ట్వంటీ టైమ్స్ లాంచ్ చేశారు. ఇప్పుడు ట్వంటీ ఫస్ట్ టైమ్ లాంచ్ చేస్తున్నారు. రాయ్బరేలీ రిజల్ట్ ఎలా ఉండబోతుందో ఇప్పుడే చెబుతున్నా.. రాహుల్ రాసిపెట్టుకో.. అక్కడ బీజేపీ అభ్యర్థి దినేశ్ ప్రతాప్ సింగ్ చేతిలో ఘోరంగా ఓడిపోబోతున్నావు”అని అమిత్ షా పేర్కొన్నారు.
©️ VIL Media Pvt Ltd. 2024-05-04T02:37:35Z dg43tfdfdgfd