రిజర్వేషన్లు ఉండాలంటే బీజేపీని ఓడించాలి : జి.చెన్నయ్య
జూబ్లీహిల్స్, వెలుగు: భారతదేశ రాజ్యాంగాన్ని కాపాడుకోవాలన్నా.. ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గాల రిజర్వేషన్లను నిలుపుకోవాలన్నా కేంద్రంలో బీజేపీని ఓడించాలని మాల ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్జి.చెన్నయ్య పిలుపునిచ్చారు. శుక్రవారం పంజాగుట్ట పోచమ్మబస్తీలో జరిగిన ఓ కార్యక్రమంలో చెన్నయ్య పాల్గొని మాట్లాడారు. బీజేపీ ప్రభుత్వంలో మైనారిటీలకు రక్షణ లేకుండాపోయిందన్నారు. మళ్లీ బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్నే మార్చేస్తారని ఆందోళన వ్యక్తం చేశారు. సికింద్రాబాద్కాంగ్రెస్ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న దానం నాగేందర్ను భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మాల ప్రజా సంఘాల జేఏసీ వర్కింగ్చైర్మన్లు పుణ్య భాను ప్రకాశ్, బూర్గల వెంకటేశ్వర్లు, గోపోజి రమేశ్, మన్నే శ్రీధర్ రావు, వినయ్కుమార్తదితరులు పాల్గొన్నారు.
©️ VIL Media Pvt Ltd. 2024-04-27T04:55:07Z dg43tfdfdgfd