రిజర్వేషన్లు ఉండాలంటే బీజేపీని ఓడించాలి : జి.చెన్నయ్య

రిజర్వేషన్లు ఉండాలంటే బీజేపీని ఓడించాలి : జి.చెన్నయ్య

జూబ్లీహిల్స్, వెలుగు: భారతదేశ రాజ్యాంగాన్ని కాపాడుకోవాలన్నా.. ఎస్సీ, ఎస్టీ, బీసీ  సామాజిక వర్గాల రిజర్వేషన్లను నిలుపుకోవాలన్నా కేంద్రంలో బీజేపీని ఓడించాలని మాల ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్​జి.చెన్నయ్య పిలుపునిచ్చారు. శుక్రవారం పంజాగుట్ట పోచమ్మబస్తీలో జరిగిన ఓ కార్యక్రమంలో చెన్నయ్య పాల్గొని మాట్లాడారు. బీజేపీ ప్రభుత్వంలో మైనారిటీలకు రక్షణ లేకుండాపోయిందన్నారు. మళ్లీ బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్నే మార్చేస్తారని ఆందోళన వ్యక్తం చేశారు. సికింద్రాబాద్​కాంగ్రెస్​ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న దానం నాగేందర్​ను భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మాల ప్రజా సంఘాల జేఏసీ వర్కింగ్​చైర్మన్లు పుణ్య భాను ప్రకాశ్, బూర్గల వెంకటేశ్వర్లు, గోపోజి రమేశ్, మన్నే శ్రీధర్ రావు, వినయ్​కుమార్​తదితరులు పాల్గొన్నారు. 

©️ VIL Media Pvt Ltd.

2024-04-27T04:55:07Z dg43tfdfdgfd