రెండు స్క్రాప్ దుకాణాల్లో మంటలు..పక్కనే 100 గ్యాస్ సిలిండర్లతో ఏజెన్సీ

రెండు స్క్రాప్ దుకాణాల్లో మంటలు..పక్కనే 100 గ్యాస్ సిలిండర్లతో ఏజెన్సీ

రంగారెడ్డి జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. స్ర్కాప్ గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గోదాంకు పక్కనే గ్యాస్ ఏజెన్సీ ఉండటంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. వివరాల్లోకి వెళ్తే రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం రాళ్లగూడ కేజీఎస్ స్ర్పాప్ గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు పక్కనే ఉన్న హాస్టల్ భవనానికి, ప్రియాంక గ్యాస్ సర్వీస్ భవనానికి వ్యాప్తి చెందుతుండటంతో చుట్టు పక్కని జనం తీవ్ర భయాందోళనకు గురయ్యారు. 

వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు.  విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. గ్యాస్ ఏజెన్సీలో దాదాపు 50 నుండి 100 వరకు సిలిండర్లు ఉన్నాయి.  గ్యాస్ కంపెనీకి ఏమైనా వ్యాపిస్తే ప్రమాదం తీవ్ర స్థాయిలో ఉండే అవకాశం ఉన్నందున ఫైర్ సిబ్బంది సిలిండర్లను బయటకు తరలిస్తున్నారు. మంటలను అదుపు చేసేందుకు ఫైర్ పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. 

రెండు ప్లాస్టిక్ స్క్రాప్ గోదాములు కావడంతో మంటలు అదుపులోకి రావడానికి ఇబ్బందికరంగా మారింద.. ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం వాటిల్లలేదని సమాచారం.ఫైర్ యాక్సిడెంట్ పై కేసు నమోదు చేసుకుని విచారణ చేపడతామని పోలీసులు తెలిపారు.

  ©️ VIL Media Pvt Ltd.

2024-03-29T05:43:32Z dg43tfdfdgfd