‘వాసవి’ నిర్మాణాలను కూల్చొద్దు హైకోర్టు సూచన

‘వాసవి’ నిర్మాణాలను కూల్చొద్దు హైకోర్టు సూచన

హైదరాబాద్, వెలుగు : మేడ్చల్‌– మల్కాజిగిరి జిల్లా బాచుపల్లిలోని కోమటికుంట చెరువు శిఖం భూమిలో వాసవి ఇన్ ఫ్రా ఎల్‌ఎల్‌పీ బహుళ అంతస్తుల నిర్మాణాలు చేస్తోందనే పిల్‌పై హైకోర్టు గురువారం విచారణ చేపట్టింది. నిర్మాణాలను నిలిపివేయాలని హెచ్‌ఎండీఏ ఉత్తర్వులను వాసవి సంస్థ సవాల్‌  చేసిన పిటిషన్‌ను జూన్‌ 4న విచారిస్తామని హైకోర్టు తెలిపింది.

అప్పటి వరకు వాసవి నిర్మించిన నిర్మాణాలపై ఎలాంటి చర్యలు తీసుకోరాదని అధికారులకు హైకోర్టు సూచించింది. ఈ వ్యవహారంపై సింగిల్‌ జడ్జి ఇచ్చిన స్టే ఆదేశాలను అమలు చేస్తామని ప్రభుత్వం చెప్పడంతో డివిజన్‌ బెంచ్‌  పైవిధంగా అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.

©️ VIL Media Pvt Ltd.

2024-05-03T03:18:37Z dg43tfdfdgfd