సీఎం హామీతో పోటీ నుంచి తప్పుకుంటున్నం: నేరెళ్ల బాధితుడు
తంగళ్లపల్లి, వెలుగు: న్యాయం చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇవ్వడంతో కరీంనగర్ నుంచి పోటీ చేసే ఆలోచనను విరమించుకుంటున్నట్టు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని నేరెళ్ల బాధితుడు కోల హరీశ్ ప్రకటించాడు. నేరెళ్ల బాధితులకు న్యాయం చేయడంతో పాటు సంబంధిత అధికారులపై కూడా శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని సీఎం హామీ ఇచ్చినట్టు శుక్రవారం మీడియాతో చెప్పాడు. తమ గోడును సీఎంకు తెలియజేసినందుకు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కేకే మహేందర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్టు పేర్కొన్నాడు.
©️ VIL Media Pvt Ltd. 2024-04-20T03:16:05Z dg43tfdfdgfd